
ఆ కార్యక్రమం చూసేందుకు ఇవాళ విశాఖకు జగన్..!
ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ నౌకను సీఎం పరిశీలిస్తారు. దీంతో పాటు జలాంతర్గామి ఐ ఎన్ ఎస్ వేలను కూడా జగన్ సందర్శిస్తారు. ఈ సాయంత్రం మిలన్ 2022 సందర్భంగా ఆర్కే బీచ్ లో నేవీ అంతర్జాతీయ సిటీ పరేడ్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం తిలకిస్తారు. సముద్ర తీరంలో దాదాపు గంటన్నర పాటు జరిగే విన్యాసాలను సీఎం జగన్ వీక్షిస్తారు. ఆ తర్వాత రాత్రి ఏడు గంటలకు సీఎం జగన్ విజయవాడకు తిరుగ ప్రయాణం అవుతారు.