ఎల్లుండి విశాఖకు జగన్.. కీలక కార్యక్రమం..?
మిలన్ 2022 సందర్భంగా నేవీ నిర్వహించనున్న అంతర్జాతీయ సిటీ పరేడ్ కార్యక్రమాన్ని జగన్ వీక్షిస్తారు. ఇందులో పాల్గొనేందుకు జగన్ ఆర్కే బీచ్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి అంతర్జాతీయ సిటీ పరేడ్ ను సీఎం జగన్ వీక్షిస్తారు. సాయంత్రం వేళ పేరెడ్ వీక్షించిన తర్వాత రాత్రి ఏడు గంటలకు సీఎం జగన్ తిరిగి విజయవాడ చేరుకుంటారు. ఇటీవల విశాఖలో నౌకాదళం సందడి పెరిగింది. మొన్ననే ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి వచ్చారు. ఇప్పుడు మిలన్ కార్యక్రమం జరగబోతోంది.