జగన్ రెడ్డీ.. హోదా గల్లంతైనా పట్టింపు లేదా..?
ప్రత్యేక హోదా అంశం ఎజెండా నుండి తొలగించి మరో సమాచార పత్రం ఇవ్వడం గమనార్హమని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ప్రత్యేక హోదా సాధనకై చిత్తశుద్ధి ప్రదర్శించాలని సీపీఐ రామకృష్ణ కోరారు. కేంద్రం ఏపీకి పదేపదే చేస్తున్న అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వామపక్ష పార్టీల నిరసన సభలు, సదస్సులు నిర్వహిస్తాయని సీపీఐ రామకృష్ణ తెలిపారు. ఈ నెల 19న విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తామని సీపీఐ రామకృష్ణ తెలిపారు.