రేపు హైదరాబాద్కు ప్రధాని.. స్వాగతం పలుకనున్న మంత్రి ఎవరంటే..?
అదేవిదంగా పర్యటన పూర్తయిన తరువాత ప్రధానికి వీడ్కోలు చెప్పే బాధ్యతలను కూడా ఆయన నిర్వర్తించనున్నారు. దీనికి సంబంధించి తాజాగా సీఎం కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. సాధారణంగా ప్రధాని ఏ రాష్ట్ర పర్యటనకు వెళ్లినా ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి వెళ్లి స్వాగతం పలకడం సంప్రదాయం. అయితే శనివారం నగరానికి రానున్న ప్రధాని మోదీకి స్వాగతం చెప్పేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లకుండా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను పంపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినది.