గడువు పెంచిన జగన్.. నిరుద్యోగులూ హర్రీ అప్‌..?

Chakravarthi Kalyan
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. గ్రూప్‌ కేటగిరీలోని రెండు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే గడువును పెంచింది. రెండు ఉద్యోగాలకు దరఖాస్తు గడువును ఏపీపీఎస్సీ మరో సారి పెంచింది. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును మరోసారి పెంచారు. అలాగే దేవాదాశాఖలో ఈవో ఉద్యోగాలకూ దరఖాస్తు గడువును పెంచారు.


ఈ రెండు కేటగిరీల్లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసే గడువును ఫిబ్రవరి 6 వరకు ఏపీపీఎస్సీ పెంచింది. ఈ రెండు ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ ఇప్పటికే ఓసారి దరఖాస్తు గడువు పెంచిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ ఉద్యోగాల దరఖాస్తు గడువు ఇవాళ్టితో పూర్తవుతోంది. అయితే.. ఇప్పుడు దరఖాస్తు గడువును మరోసారి పెంచుతూ ఏపీపీఎస్సీ ఆదేశాలు ఇచ్చింది. నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువు పెంచినట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది.  తగిన అర్హతలు ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: