బ్రేకింగ్ : ప్రపంచ ఛాంపియన్కు భారత షట్లర్ షాక్..!
ఇవాళ జరిగిన మ్యాచ్లో ప్రపంచ ఛాంపియన్ ముందు లక్ష్యసేన్ దూకుడుగా షాట్లు ఆడి టైటిల్ దక్కించుకున్నాడు. కేవలం 54 నిమిషాల వ్యవధిలోనే లక్ష్యసేన్ ఘన విజయం సాధించడం విశేషం. గత సంవత్సరం ప్రపంచ ఛాంపియన్షిప్లో తన మెరుపులతో మెరిపించి.. కాంస్య పతకాన్ని సాధించాడు. ప్రస్తుతం ఈ టైటిల్ తన బ్యాగ్లో వేసుకుని పలు రికార్డులను సృష్టించాడు. మరొక వైపు పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి కలిసి ఇండోనేషియన్ జంటను ఓడగొట్టి టైటిల్ను కైవసం చేసుకున్నారు.