పండగ పూట ప్రమాదం..ప.గో.జిల్లాలో నలుగురు మృతి
లారీ బోల్తాపడిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలవ్వగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా భావిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ అదుపుతప్పడం వల్ల లారీ బోల్తాపడిందని గాయపడిన వ్యక్తులు తెలిపారు. పండుగ వేళ ఈ ప్రమాదం జరగడంతో సంబంధీకుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.
అటు కడప జిల్లా రామాపురం మండలం బీసీ కాలనీ వద్ద టాటా సుమో బోల్తా పడన ఘటనలో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.. కడప రిమ్స్కు బాధితులను తరలించారు.