బ్రేకింగ్: రేపు ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ మీటింగ్..!
11 వ PRC ఫిట్మెంట్ 23% ప్రభుత్వం ప్రకటించడాన్ని ఈ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తూ సమావేశం ఏర్పాటు చేశాయి. ఉపాధ్యాయ,ఉద్యోగ, పెన్షనర్స్ సంఘాలతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాయి. రౌండ్ టేబుల్ అనంతరం ఉద్యమ కార్యాచరణను ఉద్యోగ సంఘాలు ప్రకటించనున్నాయి.
ఇప్పటికే కొన్ని సంఘాలు ఈ పీఆర్సీని ఒప్పుకునేది లేదని తేల్చి చెబుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ మాకు ఓకే కాదని ఇప్పటికే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సీఎస్ కు లేఖ కూడా రాసింది. సచివాలయంలో సీఎస్ ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని కూడా అందించింది. ఈ నేపథ్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం కీలకంగా మారింది.