సీఈసీ : తెలంగాణ ఓటర్ల తుది జాబితా ప్రకటన..!
ఓటర్ల జాబితాలో 18-19 ఏళ్ల మధ్య ఓటర్ల సంఖ్య 1,36,496 మంది ఉన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వివరించింది. 2021తో పోల్చితే మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 2 లక్షలు పెరిగినట్టు పేర్కొన్నది. అయితే మొదటిసారి ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఓటరు గుర్తింపు కార్డులను ఉచితంగా నేరుగా ఇండ్లకు పంపుతాం అని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మార్పులు, చేర్పులు కలిగిన వారు మాత్రం మీసేవా కేంద్రాల్లో తదితర సెంటర్లలో ఓటర్ కార్డులను తీసుకోవాలని సూచించింది.