బ్రేకింగ్ : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్ర‌మాదం

N ANJANEYULU
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇవాళ ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. ఉద‌యం స‌మ‌యంలో మంట‌లు చెల‌రేగ‌డంతో చుట్టు పక్క‌ల ఉన్న ప్రాంతానికి కూడా మంట‌లు వ్యాపించాయి. స్టీల్ ప్లాంట్‌లో ఉన్న‌టువంటి బీఎఫ్‌2లో ద్ర‌వ ఉక్కు త‌యారు చేస్తూ ఉంటారు. అయితే ఇవాళ బ్లాస్ట్ ఫ‌ర్నేస్ ప్లాంట్ 2లో ల్యాడిల్‌కు రంద్రం ప‌డిన‌ది. ఈ రంద్రం మూలంగా ఉక్కు ద్ర‌వం నేల‌పాలు కావ‌డంతో ఒక్కసారిగా మంట‌లు చెల‌రేగి.. ఈ మంట‌ల్లో రెండు లారీలు ద‌గ్దం అయ్యాయి.

వెంట‌నే స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికీ చేరుకొని మంట‌ల‌ను ఆర్పేందుకు య‌త్నం చేసారు. అయినా మంట‌లు ద్ర‌వ ఉక్కు మూలంగా అప్ప‌టికే జ‌రగాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. రెండు లారీలు ద‌గ్దం అవ్వ‌డ‌మే కాకుండా.. సుమారుగా రూ.50ల‌క్ష‌ల వ‌ర‌కు న‌ష్టం జ‌రిగింద‌ని ఒక అంచెనా వేసారు. అయితే అధికారులు అప్ర‌మ‌త్తం అవ్వ‌డంతో ప్రాణ న‌ష్టం మాత్రం జ‌ర‌గ‌లేద‌ని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: