రాజ్యసభలో జయాబచ్చన్ ఫైర్.. ఎందుకో తెలుసా..?
పలు దేశాల రాజకీయ నాయకులు, సినీ, క్రీడా రంగాల ప్రముఖులు, ఇతర సెలబ్రిటీల మనీ లాండరింగ్ వ్యవహారాలు పనామా పేపర్స్ లీక్ ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం విధితమే. భారత్లోనూ పనామా లీక్స్ ప్రకంపనలు రేపగా… ఈడీ ఈ మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతూ ఉంది. పనామా పేపర్స్ కేసులో భారత్ నుంచి దాదాపుగా 500 మంది వరకు ప్రమేయం ఉందని సమాచారం. అయితే తాజాగా ఈడీ విచారణకు ఐశ్వర్యరాజ్ హాజరు కాగా.. అటు రాజ్యసభలో జయబచ్చాన్ ఫైర్ అయ్యారు. రాజ్యసభలో కొందరూ సభ్యులు ఐశ్వర్య విషయం తీసుకురావడంపై ఆమె మండిపడ్డారు. ముఖ్యంగా మీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని.. తమ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయడం పై బయాబచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.