హెలికాప్టర్ ప్రమాదంపై సుబ్రమణ్య స్వామి ఏమన్నారంటే..?
తమిళ నాడులోని కున్నూర్ సమీపంలో జరిగిన చాపర్ ప్రమాదంలో భారత దేశం మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మరణించారని.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్యతో సహా 11 మంది ఇతర ఆర్మీ అధికారులు, సిబ్బంది మరణించిన ఘటన షాకింగ్ అన్నారు. ఈ దుర్ఘటన దేశ భధ్రతకు పెద్ద హెచ్చరిక అని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఫైనల్ రిపోర్టు రాలేదని, ఏదైనా చెప్పడం చాలా కష్టంగా ఉందని.. కానీ వాస్తవం ఏమిటంటే తమిళనాడు లాంటి సేఫ్ జోన్ లో ఉన్న మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ పేలడం ఆశర్యకరమని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు.