అధికారులతో టీటీడీ చైర్మన్ ప్రత్యేక సమావేశం
తాజాగా టీటీడీ చైర్మన్ వైసీ సుబ్బారెడ్డి ఐఐటి నిపుణులు, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిసెంబర్ నెల చివరి వరకు అప్ ఘాట్ రోడ్డు అనగా రెండవ ఘాట్ రోడ్డును పూర్తి చేయాలని సూచించారు. శనివారం నుంచి లింక్ రోడ్డు ద్వారా వాహనాలను పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అదేవిధంగా ప్రమాదకరంగా ఉన్నట్టు గుర్తించిన కొండ చరియలను కెమికల్ టెక్నాలజీని ఉపయోగించి ఇబ్బంది లేని విధంగా తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ఈ విషయంలో ఖర్చుకు ఆలోచించాల్సిన అవసరం లేదని.. భక్తుల భద్రతనే ముఖ్యమని స్పష్టం చేసారు. భవిష్యత్లో ఇలాంటి ఉపద్రవాలు తలెత్తకుండా శాశ్వత చర్యలపై దృష్టి పెట్టాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.