మద్యం మత్తులోనే పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు
ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కొప్పరవలస ప్రాథమికొన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరావు మంగళవారం ఫూటుగా మద్యం సేవించి తరగతులకు హాజరయ్యాడు. కనీసం నిల్చులేని స్థితిలో నేలపై కూర్చుండిపోయాడు. విద్యార్థులు మధ్యాహ్నం వరకు పాఠశాల వద్దే ఉండి ఇంటికి వెళ్లి పోయారు. తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని ప్రధానోపాధ్యాయుడిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక్కడ విధులు నిర్వహించడానికి మరో ఉపాధ్యాయురాలు ఉండగా.. ఆమె నిన్న సెలవులో ఉన్నారు. ఈ ఘటనపై ఎంఈవో దుర్గారావు స్పందిస్తూ ప్రధానోపాధ్యాయుడిపై గతంలోనే ఫిర్యాదు అందినదని, డీఈవోకు నివేదికను కూడా ఇచ్చామని గుర్తు చేసారు.