గ్రానైట్ లారీ క్యాబిన్‌లో మంట‌లు

N ANJANEYULU
గ్రానైట్ రాళ్ల‌ను తీసుకెళ్తున్న లారీ మార్గ మ‌ధ్య‌లో ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా మంట‌ల్లో కాలిపోయిన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఒంగోలు జిల్లా చీమ‌కుర్తి బైపాస్ ర‌హ‌దారిలో మంగ‌ళ‌వారం రాత్రి చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. చీమ‌కుర్తి ప్రాంతంలో ఉన్న‌టువంటి గ్రానైట్ క్వారీ నుంచి ట్రాలీ లారీ రాళ్ల‌తో కృష్ణ‌ప‌ట్నం పోర్టు వైపున‌కు వెళ్తున్న‌ది. చీమ‌కుర్తి బైపాస్ ర‌హ‌దారి గుండా వెళ్తుండగా మార్గ‌మ‌ధ్య‌లో కేవీపాలెం కూడ‌లి దాటిన త‌రువాత లారీ క్యాబిన్‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి.
దీంతో లారీ డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్తం అయి కిందికి దూకడంతో ప్రాణాల‌ను కాపాడుకున్నాడు. ఈ ప్ర‌మాదంలో లారీ క్యాబిన్‌తో పాటు టైర్లు, ఆయిల్ ట్యాంక్ కాలిపోయాయి. మంట‌ల తీవ్ర‌త‌కు అవి పెద్ద శ‌బ్దంతో పేలిపోవ‌డంతో స్థానికులు భ‌య‌బ్రాంతుల‌కు గుర‌య్యారు. స‌మాచారం తెలుసుకున్న అగ్నిమాప‌క సిబ్బంది హుటాహుటిన  ప్ర‌మ‌దానికి గురైన లారీ వ‌ద్దకు చేరుకొని మంట‌ల‌ను ఆర్పివేసారు. లారీ నుంచి మంట‌లు విప‌రీతంగా చెల‌రేగ‌డంతో సుమారు అర‌గంట‌పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఎస్సై నాగ‌శివారెడ్డి ఆధ్వ‌ర్యంలో రాక‌పోక‌ల‌ను ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేశారు.  లారీ నిప్ప‌ట్ల‌పాడు గ్రామానికి చెందిన వెంక‌టేశ్వ‌ర‌రావుది అని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: