ఇటీవలనే తెలంగాణ రాష్ట్రంలో వైన్షాపుల టెండర్ల ప్రక్రియ పూర్తయిన విషయం విధితమే. అయితే ఎవరెవరూ టెండర్లను దక్కించుకున్నారో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఆయా జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు. వైన్స్ షాపు టెండర్ల ప్రక్రియలో ఓ కుటుంబాన్ని అదృష్టంగా జలగలా పట్టుకున్నది. ఒక్క వైన్ షాపునకు టెండర్ దక్కితే చాలు తాము ఎంతో లక్కి అనుకుంటారు. ఒకే కుటుంబంలో నాలుగు టెండర్లు దక్కించుకున్నారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ కుటుంబం మొత్తం తొమ్మిది టెండర్లు వేస్తే వారికే నాలుగు టెండర్లు వచ్చాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అత్తాకోడళ్లు.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ క్యాసారంలో ఒకే కుటుంబానికి చెందిన అత్త, ఇద్దరూ కోడళ్లు, వారి ఆడపడుచులలు మొత్తం నలుగురు కలిసి 9 టెండర్లను వేసారు. ఈ టెండర్లలో నలుగురికి నాలుగు టెండర్లు దక్కించుకోవడం ఆశ్చర్యకరం. కొంపల్లిలోని కేవీఆర్ ఫంక్షన్హాల్లో టెండర్లు తమకే దక్కాయని తెలియడంతో ఆ నలుగురు మహిళలు ఆనందంతో ఉబ్బితబ్బిపోయారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం సంతోషంలో మునిగి తేలారు.