కోహ్లీ కూతురుకు బెదిరింపుల కేసులో ట్విస్ట్.. హైదరాబాదీ నే..!

N ANJANEYULU
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూతురిని రేప్‌ చేస్తానని బెదిరించిన కేసులో హైదరాబాద్ వ్య‌క్తి  అరెస్ట్‌ కావడం సంచలనం రేపుతోంది. టీ-20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో ఓటమి తరువాత కోహ్లీ కూతురిని రేప్‌ చేస్తానని ఫోన్లో బెదిరించాడు ఆ వ్య‌క్తి. మ‌రెవ‌రో కాదు  హైదరాబాద్‌కు చెందిన అలిబత్తిని రామ్‌నాగేశ్‌( 23),  ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు. ముంబైకి  తీసుకెళ్లి  విచారణ చేప‌డుతున్నారు.   రాంనాగేశ్ మహ్మద్‌ షమీకి సపోర్ట్‌ ఇచ్చినందుకు కోహ్లీని బెదిరించాడు.

విరాట్ కోహ్లీ నీ బెదిరించిన కేసులో అరెస్ట‌యిన హైద‌రాబాద్‌కు చెందిన వ్య‌క్తి ముంబై సైబ‌ర్ క్రైమ్ పోలీసులు అక్క‌డికి తీసుకెల్లారు. రామ్‌నగేష్ ప్ర‌ముఖ సాప్ట్‌వేర్ కంపెనీలో ప‌ని చేస్తున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఓడిపోయిన సంద‌ర్భంగా  చిన్నారి వామికపై అత్యాచారం తప్పదంటూ  ఆశ్చర్యకరంగా మారిన‌ది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు సిగ్గుతో తలదించుకోవాలని, మీ కూతురు వామిక ఫొటోలను ఎప్పుడెప్పుడు చూపిస్తారా.. అని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ఎప్పుడు త‌న‌ను రేప్ చేస్తానా అని ఎదురు చూస్తున్నాను అని ట్విట్ట‌ర్ ఖాతా నుంచి కోహ్లీకి పోస్ట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారిన‌ది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: