పవన్ అందుకే ఓడిపోయారు... ఏకిపారేసిన ఎమ్మెల్యే...?

Gullapally Rajesh
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. పవన్ వైసీపీ నాయకులను నిందించడానికి విశాఖ వచ్చారా.? అని ఆయన ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ ఆస్తా లేకపోతే లేక రాష్ట్ర ప్రభుత్వ ఆస్తా అనేది పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. 32 మంది ప్రాణ త్యాగాల ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది అని ఆయన గుర్తు చేసారు. గత కొన్ని నెలలు గా విశాఖ ఉక్కు కోసం ఉద్యమాల జరుగుతుంటే పవన్ కు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

పవన్ మాటలు విని మోసపోయే ప్రజలు ఈ రాష్ట్రం లో లేరు అని అన్న ఆయన అందుకే గాజువాక లో పవన్ ఓడిపోయారు అని ఎద్దేవా చేసారు. గాజువాక లో నన్ను  ఓడించారు... నన్ను గెలిపిస్తే పోరాటం చేసేవాడ్నీ అని అందరి ముందు చెప్పారు అని అన్నారు. ఎంత కాలం ప్రజలకు సినిమా డైలాగులు చెబుతారు అని నిలదీశారు. పవన్ రాకపోయినా ఉక్కు ఉద్యమం నడుస్తుంది అని వైసీపీ ముందుండి నడిపిస్తుంది అన్నారు ఆయన. గతం లో  ఉక్కు పరిశ్రమ కోసం ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేశారు అని ఆయన గుర్తు చేసారు.

విశాఖ పర్యటన కు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఉక్కు కార్మికులను కలిశారు అని పేర్కొన్నారు. కార్మికులు చెప్పిన విషయాలను అసెంబ్లి లో తీర్మానం చేశారు అని ఆయన వివరించారు. పవన్ సభ లో మోదీ కోసం ఒక్క మాట అయిన మాట్లాడారా అని ఆయన నిలదీశారు. పవన్ కు దమ్ము ఉంటే  ఢిల్లీ లో  స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చెయ్యాలి అని హితవు పలికారు. స్ధిరంలేని నాయకుడు పవన్ అని అన్నారు ఆయన. ఇప్పటికే మూడు పార్టీలతో దోస్తీ చేసి కటీఫ్ అయింది? మళ్ళీ ఎవరితో జోడి కడతారో? అని ఆయన ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: