రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త...! పోడు భూములపై కీలక నిర్ణయం
రాష్ట్రంలో 87 శాతం అటవీ భూములు ఉన్నాయని.. అవి 12 జిల్లాలలోనే ఉన్నాయని పోడు భూముల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని సూచించారు. అడవి మీద ఆధారపడే గిరిజనులకు మేలు చేసేవిధంగా ఉండాలని తెలిపారు. అడవులను నాశనం చేసే కొన్ని శక్తులపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అటవీ భూముల రక్షణలో కీలక పాత్ర కలెక్టర్లు వహించాలన్నారు. అన్ని జిల్లాలలో అఖిలపక్షాల సమావేశాలు నిర్వహించి, అందులో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి వారి నిర్ణయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.