ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
మొదటిసారి ఈ ఏడాది ప్రయోగాత్మకంగా వృత్తివిద్య, కొన్ని మైనర్ సబ్జెక్టులను ఆన్లైన్లో మూల్యాంకనం చేశారు. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 02 వరకు సమాధాన పత్రాల రీ వాల్యూవేషన్, పరిశీలనకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. ఒక్కో పేపర్కు రివాల్యూవేషన్కు రూ.260, స్కాన్కాఫీ, పునఃపరిశీలనకు రూ.1300 చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలదు. స్కానింగ్ ఆన్సర్ షీట్ కూడ ఆన్లైన్లోనే లభ్యం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 3,24,800 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 14,950 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.