సోము తో ఢిల్లీ టూర్ కు పవన్...?

ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. గత కొంతకాలంగా పార్టీ అధిష్టానం తో విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడడానికి సోము వీర్రాజు సిద్ధమవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపేందుకు బిజెపి పెద్దలు కూడా సిద్ధం అవుతున్నారని అందుకే సోము వీర్రాజు తో కలిసి పవన్ కళ్యాణ్  ఢిల్లీ రావాల్సిందిగా ఆహ్వానించారు అని అంటున్నారు. త్వరలోనే ఈ పర్యటనకు సంబంధించి అధికారిక తేదీ కూడా ప్రకటించే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ తో పాటుగా కొంతమంది విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి పోరాటం చేస్తున్న వాళ్లు కూడా వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: