ఆర్సిబి జట్టు కెప్టెన్సి కి గుడ్ బై చెప్పిన కోహ్లీ..

Purushottham Vinay
ఇటీవల టీ 20 జట్టు కెప్టెన్సి కి గుడ్ బై చెప్పిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా తప్పుకుంటూ కోహ్లీ కాసేపటి క్రితం నిర్ణయం తీసుకున్నట్టుగా రాయల్ చాలెంజర్స్ జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు తమ అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాల్లో వీడియోలను పోస్ట్ చేసింది.తాను జట్టులో ఆటగాడిగా కొనసాగుతానని కెప్టెన్ గా కొనసాగేది లేదని కోహ్లీ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ పూర్తయిన తర్వాత తాను తప్పుకుంటున్న అని ఈరోజు సాయంత్రం ఆటగాళ్ళతో అలాగే జట్టు యాజమాన్యం తో కూడా తాను మాట్లాడానని కోహ్లీ సదరు వీడియోలో పేర్కొన్నాడు.

ఇన్ని రోజులు తనకు సహకరించిన జట్టు ఆటగాళ్లకు అదేవిధంగా అభిమానులకు కోహ్లీ ధన్యవాదాలు చెప్పాడు.కోహ్లీ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు.జట్టులో కీలక ఆటగాళ్లు ఉన్నాసరే అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ళను కొనుగోలు చేసినా సరే జట్టు మాత్రం కప్పు గెలవలేక పోవడం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి.అన్ని జట్లు కెప్టెన్లను మార్చిన యాజమాన్యాలు బెంగళూరు జట్టుకి కెప్టెన్ ను మార్చకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి.గత 7, 8 ఏళ్ల నుంచి తాను తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నా అని అందుకే టీ-20 జట్టు కెప్టెన్గా తప్పుకున్నారని ఇటీవల కోహ్లీ అభిమానులకు రాసిన లేఖలో ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: