కేటీఆర్‌కు అరుదైన గౌర‌వం

Garikapati Rajesh

తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క‌శాక మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. దావోస్‌లోని వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం నుంచి ఆహ్వానం అందింది. 2022లో జ‌రిగే వార్షిక స‌ద‌స్సుకు హాజ‌రు కావ‌ల్సిందిగా ఆహ్వానం పంపించారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 17 నుంచి 21వ తేదీ వ‌ర‌కు స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్‌లో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్రానికి ల‌భించిన అరుదైన గౌర‌వంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. కొవిడ్ నుంచి రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ వేగంగా కోలుకోవ‌డానికి కేటీఆర్ నాయ‌క‌త్వంలో సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగిస్తూ తెలంగాణ చూపిన విజ‌న్‌కు గుర్తింపుగా ఈ ఆహ్వానం పంపిస్తున్న‌ట్లు ఫోరం అధ్య‌క్షుడు బోర్గ్‌బ్రెండ్ కొనియాడారు. ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, ఆవిష్క‌ర‌ణ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం క‌న‌ప‌రుస్తోన్న ప్ర‌తిభ‌కు గుర్తింపుగా ఇది ల‌భించిన‌ట్లు కేటీఆర్ అన్నారు. త‌న‌కు అందిన ఆహ్వానాన్ని ప్ర‌పంచ‌వేదిక‌పై తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక అనుకూల విధానాల‌ను  ప్ర‌పంచ‌స్థాయి కంపెనీల‌ను ఆక‌ర్షించేందుకు, వారి పెట్టుబ‌డుల‌ను ర‌ప్పించుకునేందుకు దీన్ని వినియోగిస్తాన‌ని కేటీఆర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: