గుంటూరు జిల్లాలో విద్యుత్ షాక్.. ఆరుగురు మృతి
మరణించిన వారిని ఒడిశాకు చెందిన రామ్మూర్తి, కిరణ్ , మనోజ్ , పండబో, మహేంద్ర, నవీన్ గా గుర్తించారు. ఈ ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన మరోసారి వలస జీవితాల్లో విషాదాన్ని గుర్తు చేస్తోంది. పొట్టకూటి కోసం ఎక్కడి నుంచో వచ్చి పని చేసే ఒడిశా వాసులు పిట్టల్లా రాలిపోయారు. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా.. ఇందులో మరేదైనా కోణం ఉందా అన్న అనుమానంతోనూ దర్యాప్తు చేస్తున్నారు.