భర్త చచ్చిపోయాడనుకుని భార్య ఏం చేసిందంటే...

ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల విషయంలో ఆత్మహత్యలు పెరగడం కాస్త కలవర పెడుతున్న అంశం. తాజాగా గుంటూరు జిల్లాలో ఒక ఘటన జరిగింది. యడ్లపాడు మండలం చంఘీస్ ఖాన్ పేట లో విషాదం చోటు చేసుకుంది. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త పురుగుల మందు తాగిన ఘటన ఇది. భర్త మందు తాగిన విషయం తెలిసి ఇంట్లో భార్య కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటనలో భార్య  రాజేశ్వరి(21) మృతి చెందగా  కాటూరి ఆసుపత్రి లో చికిత్స భర్త శివ శంకర్ చికిత్స తీసుకుంటున్నారు. భర్త శివశంకర్ ఆర్మీలో పని చేస్తుండగా 11 నెలల క్రితమే మేనకోడలు రాజేశ్వరి తో వివాహం అయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: