దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం 3 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా రోజువారీ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య కూడా తగ్గుముకం పడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 54,069 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,321 మంది మృతి చెందారు. అంతే కాకుండా 68,885 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,00,82,778 కి చేరుకుంది. ఇక ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 2,90,63,740గా ఉంది. ప్రస్తుతం దేశంలో 6,27,057 యాక్టీవ్ కేసులున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా కరోనా తో మృతి చెందిన వారి సంఖ్య 3,91,981 గా ఉంది. దేశ వ్యాప్తంగా టీకా తీసుకున్న వారి సంఖ్య 30,16,26,028 గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది.