ముగ్గురు పిల్లల మిస్సింగ్ ఘటనలో విషాదం.. !

కృష్ణాజిల్లా అగిరిపల్లి మండలం లో ముగ్గురు చిన్నారులు అదృశ్యమైన సంగతి తెలిసిందే . కాగా ఈ ఘటన విషాదాంతమైంది . అగిరిపల్లి మండలంలోని ఈదర నగరపేటలోని చెరువులో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు . ఆడుకోడానికి బయటికి వెళ్ళిన జగదీష్ , చంద్రిక ,శశిత కనిపించకుండా పోయారు . తల్లిదండ్రులు గ్రామం మొత్తం గాలించారు కానీ చిన్నారుల జాడ దొరకలేదు . దాంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు .

పోలీసులు గ్రామం మొత్తం గాలింపులు చేపట్టారు . ఈ క్రమంలో ఈదర సమీపంలోని శోభనాపురం చెరువులో చిన్నారుల దేహాలను మంగళవారం రాత్రి పోలీసులు గుర్తించారు . ముగ్గురు పిల్లలు శవమై కనిపించడం తో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి . చిన్నారుల కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. తల్లిదండ్రులు గ్రామం మొత్తం గాలించారు కానీ చిన్నారుల జాడ దొరకలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: