ఓఆర్ఆర్ వద్ద సగం కాలిన బాలిక శవం..
స్రవంతి ఇటీవల పదో తరగతి పాస్ అయినట్టు సమాచారం. అర్ధరాత్రి ఇంట్లో నుండి బయటకు వెళ్లినట్టు పోలీసులకు తల్లిదండ్రులు చెప్పారని తెలుస్తోంది. సర్వీస్ రోడ్డు పక్కన కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని చూసి పోలీసులకు కాలనీ వాసులు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు.