ఎంపీటీసీలు మరియు సర్పంచ్ లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని సర్పంచ్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల గౌరవ వేతనాలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే హోంగార్డులు, ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్లు/సహాయకులు, విలేజ్ ఆర్గనైజేషన్ ,విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్, అసిస్టెంట్, సెర్ప్ ఉద్యోగుల జీతాలను కూడా 30 శాతం పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో సదరు ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.