బెంగాల్ 8వ విడ‌త పోలింగ్‌: 10 AM అప్‌డేట్స్‌

VUYYURU SUBHASH
పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్‌ కొనసాగుతోంది.  ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చివరి విడత పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 11,680 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.ఉదయం 10 గంట‌ల‌ వరకు 19.04 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.నటుడు మిథున్‌ చక్రవర్తి ఉత్తర కోల్‌కతాలోని కాశిపూర్-బెల్గాచియా పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుక్నురు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: