దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవుతోంది. కరోనా దెబ్బతో ఎంతో మంది సెలబ్రిటీలు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా కరోనా వేవ్ మాత్రం ఆగడం లేదు. తాజాగా కరోనా దెబ్బతో ఏపీలో పోలీస్ శాఖలో ఓ ఉన్నతాధికారి మృతి చెందారు. విజయనగరం జిల్లాలో కరోనా మహమ్మారి వల్ల సీసీఎస్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న జె.పాపారావు మృతి చెందారు. గత రెండు రోజులుగా కరోనా బారిన పడిన ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు, ఎస్పీ రాజకుమారి, జిల్లా పోలీసులు విచారం వ్యక్తం చేశారు.