తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యలు, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేస్తున్నారు. నిరుద్యోగుల బలవన్మరణాలపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మద్దతుగా ఎవరు మాట్లాడకపోయినా.. వాళ్లకు తాను అండగా ఉంటానన్నారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే షర్మిల మూడు రోజులు దీక్షకు అనుమతి కోరగా పోలీసులు మాత్రం ఒక రోజు మాత్రమే అనుమతి ఇచ్చాడు. మరి షర్మిల పోలీసుల అనుమతి మేరకు ఒకరోజు తోనే దీక్ష ముగిస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.