తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి హిందువు కాదంటూ బీజేపీ నేత సునీల్ దేవ్ ధర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఉప ఎన్నికల ప్రచారంలో ఇది పెద్ద కాంట్రవర్సీగా మారింది. దీనిపై గురుమూర్తి వివరణ ఇచ్చారు. తాను హిందువునేనని చెప్పారు. తాను గ్రామదేవతలకు చేసిన పూజలు, వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఫొటోలను జత పర్చారు. ఉప ఎన్నికల్లో గెలవలేమని నిర్దారణకు వచ్చిన బీజేేపీ దిగజారి రాజకీయాలను చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అభ్యర్థి క్యారెక్టర్, కులం, మతం గురించి దిగజారి మాట్లాడుతున్నారన్నారు.