తిరుమల శ్రీవారిని తదుపది సీజేఐ ఎన్వీ. రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్నారు. రమణ కుటుంబానికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం ఏర్పాటు చేశారు. వీరికి టీటీడీ చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి స్వాగతం పలకడంతో పాటు దగ్గరుండి ఏర్పాట్లు చేసి స్వామివారి ప్రసాదాలు అందజేశారు.