పార్టీ నుంచి మ‌హిళా ఎమ్మెల్యే స‌స్పెన్ష‌న్‌

VUYYURU SUBHASH
త‌మిళ‌నాడు ఎన్నిక‌లు ముగిసినా అక్క‌డ రాజ‌కీయాలు మాత్రం వేడి వేడిగానే ఉన్నాయి. పార్టీ వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డినందుకు ఓ మ‌హిళా ఎమ్మెల్యేను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. కడలూరు జిల్లా పన్రుట్టి శాసనసభ నియోజకవర్గం అన్నాడీఎంకే శాసనసభ్యురాలు సత్యా పన్నీర్‌సెల్వంను పార్టీ నుంచి తొలగించారు. శాసనసభ ఎన్నికల్లో తనకు మళ్లీ పార్టీ టికెట్‌ లభించలేదన్న ఆగ్రహంతో ఆమె పన్రుట్టి నియోజకవర్గంలో పోటీ చేసిన అన్నాడీఎంకే అభ్యర్థి రాజేంద్రన్‌కు వ్యతిరేకంగా డీఎంకే అభ్యర్థికి మద్దతుగాను పనిచేసినట్టు ఆరోపణలు రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: