జ‌గ‌న్‌కు క‌రోనా వ్యాక్సిన్ అక్క‌డే... స్పెషాలిటీ ఇదే

VUYYURU SUBHASH
ఏపీలో క‌రోనా వ్యాక్సిన్ ఓ వైపు కొన‌సాగుతున్నా మ‌రో వైపు మాత్రంం క‌రోనా కేసుల పెరుగుద‌ల మాత్రం ఆగ‌డం లేదు. మ‌రోవైపు క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్రక్రియ‌ను ప్ర‌భుత్వం వేగ‌వంతం చేస్తున్నాక రోనా భ‌యం మాత్రం తొల‌గిపోవ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ప‌లువురు ప్ర‌ముఖులు క‌రోనా వ్యాక్సిన్ వేయించుకుంటూ ప్ర‌జ‌ల్లో ధైర్యం చెపుతున్నారు. ఈ క్ర‌మంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క‌రోనా వ్యాక్సిన్ వేయించుకోనున్నారు.
జ‌గ‌న్ వ‌చ్చే 1న గుంటూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌డంతో పాటు అక్క‌డే వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. గుంటూరులోని భరత్ పేట వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సినేషన్ ను జగన్ ప్రారంభించనున్నారు. అక్కడే జగన్ తాను కూడా కరోనా వ్యాక్సినేషన్ తీసుకోనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్ ను ఏప్రిల్ 1నుంచి అన్ని వార్డు సచివాలయాల్లో అందించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: