అమరావతికి జగన్ మరో షాక్ ఇచ్చారా...?

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం అమరావతి విషయంలో ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుంది అనే ఆరోపణలు తెలుగుదేశం నేతలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో గుంటూరుకు తోడు మరో నగరంను ఏర్పాటు చేసింది. ఎంటీఎంసిలో మంగళగిరి, తాడేపల్లి విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒకే కార్పొరేషన్‌గా రెండు పట్టణాలు, 21 గ్రామాలు ఉంటాయి.

పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈ మేరకు  ఉత్తర్వులు ఇచ్చారు.  అమరావతి మహా నగరపాలక సంస్థ ప్రతిపాదనకు ప్రభుత్వం చరమగీతం పాడింది అనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ నిర్ణయం వెనుక అమరావతి ఊసే లేకుండా చేసే కుట్ర ఉందనే అనుమానం వ్యక్తం చ్చేస్తున్నారు. మంగళగిరి, తాడేపల్లి మునిసిపల్‌ పట్టణాల సహా వాటి చుట్టుపక్కల ఉన్న 21 గ్రామాలను కలిపి మంగళగిరి-తాడేపల్లి మునిసిపల్‌ కార్పొరేషన్‌(ఎంటీఎంసీ) ఏర్పాటు చేసారు. మంగళగిరి మండలంలో 14 గ్రామాలు ఉండగా కృష్ణాయపాలెం, నీరుకొండ, కురగల్లును మినహాయించి మిగతా 11 గ్రామాలు కార్పొరేషన్ పరిధి కిందకు తీసుకొస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లి పట్టణంతో పాటు ఆ మండల పరిధిలోని పది గ్రామాలను కార్పొరేషన్‌ కిందకు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: