మాతృ భాషను అందరూ కాపాడుకోవాలి: వెంకయ్య

కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో ఘనంగా నివాళి అర్పించారు. తెలుగు భాషే మన అస్తిత్వమని ఎలుగెత్తి చాటిన కవి, బహుభాషా కోవిదుడు శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని ఆయన ట్వీట్ చేసారు.

సమాజంలో వర్గ సంఘర్షణ, లింగ వివక్షను రూపుమాపే సంకల్పంతో వారు చేసిన రచనలు స్ఫూర్తిదాయకమని కీర్తించారు. “బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలి” అంటూ నినదించిన ప్రజా కవి శ్రీ కాళోజీ స్ఫూర్తితో మాతృ భాషను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అటు తెరాస నేతలు కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: