తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలో దారుణం!
దేశంలో మనుషుల మద్య సంబంధ బాంధవ్యాలు తెగిపోతున్నాయి. డబ్బు మాత్రమే పరమావధిగా భావిస్తున్నారు. ఇందు కోసం ఎంతటి దారుణాలకైనా తెగబడుతున్నారు. తాజాగా తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలో దారుణం జరిగింది. 7 సంవత్సరాల బాలిక అరంతాంగి గ్రామంలో రెండు రోజులక్రితం అదృశ్యమైంది. ఈ నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్న సమయంలో గ్రామంలోని చెరువు దగ్గర తీవ్ర గాయాలతో బాలిక మృతదేహం దొరకడం తో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు.