చిటికెలెందుకు చంద్రబాబా అంటున్న ఎంపీ ?
ఏపీ సీఎం చంద్రబాబుపై, ఆయన తనయుడు చినబాబు నారా లోకేష్పై ప్రతి నిత్యం తనదైన సెటైర్లతో విరుచుకు పడుతూ ఉంటారు వైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. చంద్రబాబును తుప్పునాయుడు అని.. లోకేష్ను చినబాబు, పప్పుబాబు అని రకరకాల పేర్లతో విమర్శించడంలో విజయసాయి చతురతే వేరు. తాజాగా చంద్రబాబుపై మరోసారి విజయసాయి తనదైన స్టైల్లో విరుచుకు పడ్డారు. చంద్రబాబు ఏపని చేసినా నిజాయితీ ఉండదు.
కర్మ కాలి ఇప్పుడు సిఎంగా ఉండుంటే కరోనా కేసులను వేలల్లో చూపించి, ప్రాణనష్టం లేకుండా చేశా అని దేశమంతా డప్పుకొట్టుకుని తిరిగేవాడు. పాజిటివ్ రోగులను దాచాల్సిన అవసరం ప్రభుత్వ యంత్రాంగానికి ఏం అవసరం ? మనవడితో ఆడుకోక మధ్యలో ఈ చిటికెలెందుకు ? అని విమర్శించారు. ఇక చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్లో కూర్చొని ఏపీ ప్రభుత్వం చేస్తోన్న కార్యక్రమాలపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.
చంద్రబాబు ఏపని చేసినా నిజాయితీ ఉండదు. కర్మ కాలి ఇప్పుడు సిఎంగా ఉండుంటే కరోనా కేసులను వేలల్లో చూపించి, ప్రాణనష్టం లేకుండా చేశా అని దేశమంతా డప్పుకొట్టుకుని తిరిగేవాడు. పాజిటివ్ రోగులను దాచాల్సిన అవసరం ప్రభుత్వ యంత్రాంగానికి ఏం అవసరం? మనవడితో ఆడుకోక మధ్యలో ఈ చిటికెలెందుకు? — Vijayasai reddy v (@VSReddy_MP) April 17, 2020