'లైగర్' బ్యూటీకి పుట్టినరోజు శుభాకాంక్షలు

Vimalatha
బాలీవుడ్ నటి అనన్య పాండే ఈరోజు తన 23వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈమె ప్రముఖ నటుడు చుంకీ పాడే కుమార్తె. అనన్య ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అనన్య తన అందంతో పాటు నటనతోనూ హెడ్‌లైన్స్‌లో నిలిచింది. అనన్య సినిమాల్లో కనిపించక ముందే సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2' ఆమె మొదటి చిత్రం. అనన్య 2019లో తారా సుతారియాతో కలిసి చేసిన ఈ చిత్రం కరణ్ జోహార్ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సీక్వెల్. 2012 లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే దురదృష్టవశాత్తూ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2' మాత్రం ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాలో అనన్య లుక్స్, నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ కథానాయకుడిగా కనిపించారు.
ఇషాన్ ఖట్టర్ సరసన ఆమె నటించిన నెక్స్ట్ చిత్రం 'ఖాళీ  పీలీ' చిత్రంలో కన్పించింది. ఈ చిత్రం ఒక విలక్షణమైన బాలీవుడ్ డ్రామా. ఇషాన్ ఖట్టర్ టాక్సీ డ్రైవర్ గా, అనన్య అతని చిన్ననాటి స్నేహితురాలిగా నటించారు. అనన్య 'పతి పత్నీ ఔర్ వో' మరియు 'ఖాలీ-పీలీ' వంటి చిత్రాలలో నటించి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే పాపులారిటీతో పాటు ట్రోలర్ల టార్గెట్ కూడా ఎదుర్కొన్నారు. నెపోటిజం కారణంగా ట్రోలింగ్ బారిన పడింది. ఆమెను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు.
ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ "లైగర్"తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. తెలుగు, హిందీతో పాటు పలు ప్రధాన భాషల్లో విడుదల కానున్న అనన్యకు తెలుగులో ఇదే మొదటి చిత్రం. ఈ సినిమా హిట్ అయ్యిందంటే ఆమెకు టాలీవుడ్ తో పాన్ ఇండియా సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: