సెంచరీ లోకి అడుగు పెట్టిన మాజీ త్రివిధ దళాల సైనికుడు!
రెండో ప్రపంచ యుద్ధంలో గెజిటెడ్ అధికారిగా ఐఎన్ఎస్ టీర్లో చేరడానికి ముందు మైన్ స్వీపింగ్ ఓడలో విధులు నిర్వర్తించినట్టు తెలిపారు. నేవీలో యువ సబ్-లెఫ్టినెంట్గా చేరిన తర్వాత లాంగ్ రేంజ్ గన్నరీ కోర్సును పూర్తిచేసి గన్నరీ ఇన్స్ట్రక్టర్ హోదా పొందాను.. అలాగే సిక్కు రెజిమెంట్కు సేవ చేసే కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఆశతో నేను ఆర్మీలో చేరాను’ అన్నారు. గన్నరీ ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన అనుభవం వల్ల గ్వాలియర్ మౌంటెయిన్ బ్యాటరీలో పోస్టింగ్ దక్కిందని గిల్ కుమారుడు డాక్టర్ అజయ్ పాల్ సింగ్ తెలిపారు. ప్రీతిపాల్ కుటుంబంలోని మూడు తరాలు ముత్తాత నేహన్ సింగ్, తాత బిర్ సింగ్, తండ్రి హర్పాల్ సింగ్ అంతకు ముందు సైన్యంలో పనిచేశాయి. తరువాత 34 మీడియం రెజిమెంట్లోనూ, అక్కడ నుంచి 71 మీడియం రెజిమెంట్లో పోస్టింగ్ వచ్చింది. గిల్ వందో పుట్టిన రోజు సందర్భంగా భారత సైన్యం తరపున 71వ మీడియం రెజ్మెంట్ ఆయనకు కేక్ పంపింది. తనకు ఉన్న మంచి జ్ఞాపకాలలో ఒకటి 1965 భారత-పాకిస్తాన్ యుద్ధం అని అన్నారు. ‘మేము శత్రు శిబిరం నుంచి నాలుగు తుపాకులను పొందామని చెప్పారు. ఐదేళ్ల తరువాత అస్సాం రైఫిల్స్ సెక్టార్ కమాండర్లో కల్నల్గా పదవీ విరమణ చేసిన గిల్.. అప్పటి నుంచి స్క్వాష్, హాకీ, టెన్నిస్తో బిజీగా గడిపినట్టు తెలిపారు.