ఈ చిన్న టిప్స్ పాటిస్తే అన్ని ముఖ సమస్యలు మాయం?
ఇందుకోసం కుంకుమపువ్వును తేనెతో కలిపి ముఖానికి బాగా పట్టించి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి.ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడగాలి.ఇంకా అలాగే కుంకుమపువ్వును పాల క్రీమ్తో కలిపి ముఖానికి రాసుకుని బాగా మసాజ్ చేయడం వల్ల కాంతివంతమైన మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. ఇక ఇందుకోసం రాత్రి పడుకునే ముందు కుంకుమపువ్వుతో మీగడని మిక్స్ చేసి ముఖానికి రాసుకుని బాగా మసాజ్ చేసి నైట్ నిద్రపోవాలి. ఆ తర్వాత ఉదయాన్నే లేచి ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం మీకు కనిపిస్తుంది.కొబ్బరినూనెలో కుంకుమపువ్వును కలిపి చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం పొడిబారడం నుండి ఉపశమనం పొందుతుంది.ఒక చెంచా పాలలో ఒక జంట కుంకుమపువ్వును తీసుకొని రాత్రంతా నానబెట్టండి. తరువాత రోజు అందులో ఒక చెంచా కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి బాగా పట్టించి ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి.