ఈ జ్యూస్ తో చర్మ సమస్యలన్ని దూరం..

Purushottham Vinay
ఇక చాలామందికి కూడా బయటి వాతావరణం ఆహ్లాదంగా కనిపించినా వారి చర్మంలో అనేక మార్పులు  వస్తూ ఉంటాయి.బాహ్య చర్మ సంరక్షణ ఎంతో కీలకమవుతుంటుంది. ముఖ్యంగా చర్మ సంరక్షణ విషయంలో మాత్రం చర్మం సంరక్షణ అనేది ఎంతో కీలకం.అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంతో నష్టం కలుగుతుంది. బాడీ లోపల ఆరోగ్యం ఎంత ముఖ్యమో బాడీ బయట సంరక్షణ కూడా అంతే ముఖ్యం.బయట సహజంగా ఎదురయ్యే సమస్య చర్మం పగలడం లేదా చర్మం పొడి బారి బాగా దురద రావడం లాంటి సమస్యలు అనేవి వస్తుంటాయి.అందుకే ఎప్పుడూ కూడా చర్మాన్ని సాధ్యమైనంతగా మృదువుగా తేమగా ఉంచుకుంటే చాలా మంచిది.ఇక చర్మం ఎప్పుడు తాజాగా ఉండటానికి అలాగే ముఖ సౌందర్యం పెంచుకోడానికి కూడా క్యారెట్ చాలా బాగా పని చేస్తుంది. క్యారెట్ జ్యూస్, పెరుగు ఇంకా ఎగ్ వైట్ లను సమపాళ్లలో మిక్స్ చేసుకొని ..ఆ మిశ్రమాన్ని ముఖానికి బాగా రాసుకోవాలి. అలా ఒక 15 నిమిషాలు పాటు ఉంచుకుని తరువాత గోరువెచ్చని నీళ్లతో బాగా కడిగేయాలి. ఇక ఇలా చేస్తే చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అనేవి తొలగిపోతాయి. చర్మం కూడా చాలా ఫ్రెష్ అవుతుంది.

జిడ్డు చర్మం ఉన్నవారికి సైతం క్యారెట్లతో ఎంతో ప్రయోజనం కలుగుతుంది.  ఒక కప్పు క్యారెట్ జ్యూస్ లో ఒక్క టేబులు స్పూన్ పెరుగు, శెనగ పిండి ఇంకా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి ఇంకా మెడకు ప్యాక్‌గా వేసుకోవాలి. అలా ఓ అరగంట తరువాత గోరువెచ్చని నీటితో చర్మాన్ని కడిగితే..జిడ్డు చర్మం నుంచి వెంటనే విముక్తి పొందవచ్చు. క్యారెట్ సగం ముక్కను బాగా తురుం చేసి లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీలో  వేసి బాగా పేస్ట్ గా చేయాలి.  ఇందులో ఒక టీ స్పూన్ తేనె ఇంకా ఒక టీ స్పూన్ పాలు వేసి బాగా కలిపి చర్మానికి రాయాలి. ఒక 15 నిమిషాల తరువాత చల్లని నీళ్లతో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. మీ చర్మం ఎంతో తేమగా..అలాగే ఎప్పుడు కూడా చాలా మృదువుగా ఉంటుంది. ఇక ఇదే మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ ‌గా వేసుకుంటే ఎలాంటి చర్మ సమస్యలు రావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: