IND vs SL 1st ODI: టాస్ గెలిచిన శ్రీలంక!

Purushottham Vinay
ఇక T 20 సిరీస్ గెలిచిన ఊపులో టీమిండియా వన్డే సమరానికి సిద్ధమైంది. ఈ సంవత్సరం పొరుగు దేశం శ్రీలంకతో తొలి వన్డే ఆడనున్న టీమిండియా.. వన్డే సిరీస్‌ను కూడా ఎలాగైనా గెలిచేందుకు ప్లాన్ చేస్తోంది.ఈ క్రమంలో టాస్ గెలిచిన శ్రీలంక టీం ఇండియాని కట్టడి చేయడానికి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రోహిత్ సేన మొదట బ్యాటింగ్ చేయనుంది.గౌహతిలో స్టార్ట్ అయిన ఈ మ్యాచ్‌తో టీమిండియా మిషన్ వరల్డ్ కప్‌కు రెడీగా ఉన్నట్లు అర్ధం. 


ఈ సంవత్సరం అక్టోబర్‌-నవంబర్‌లో ఇండియాలో వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. అందువల్ల టోర్నీ ప్రారంభం దాకా దేశంలో జరిగే ప్రతి వన్డే మ్యాచ్ ఇండియా జట్టుకు చాలా కీలకం కానుంది. అలాగే అదే సమయంలో ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసి రికార్డు బద్దలు కొట్టే ఛాన్స్ కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: