టార్గెట్‌ 119.. కోదండరామ్‌ టార్గెట్ ఇదే?

Chakravarthi Kalyan
తెలంగాణ జన సమతి.. ప్రొఫెసర్ కోదండరామ్‌ పెట్టిన ఈ పార్టీ గుర్తుందా.. ఈ పార్టీ గత ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. అయితే.. రాజకీయంగా బలోపేతమవుతూ...తెలంగాణను కాపాడుకుంటామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్‌ అంటున్నారు. వచ్చే ఎన్నికల్ల అన్ని సీట్లకు పోటీ చేస్తామంటున్నారు. తెలంగాణ ఉద్యమకారులమంతా  సమావేశమయినామని...తెలంగాణవాదులమంతా ఐక్యమై తెలంగాణ వాదాన్ని రక్షించుకోవాలని నిర్ణయించామని ప్రొఫెసర్ కోదండరామ్‌ తెలిపారు.

కేసీఆర్ అస్తిత్వం కోసం తప్పితే తెలంగాణ అస్తిత్వాన్ని పట్టించుకోలేదని ప్రొఫెసర్ కోదండరామ్‌ ఆరోపించారు. దేశవ్యాప్తంగా కేసీఆర్‌ అవినీతిని ఎండగడుతామని  ప్రొఫెసర్ కోదండరామ్‌ స్పష్టం చేశారు. జనవరి 30న దిల్లీలో సెమినార్ నిర్వహిస్తామన్న ప్రొఫెసర్ కోదండరామ్‌..  31న విభజన హామీలపై ఆందోళన చేస్తామని వెల్లడించారు. కృష్ణా జలాల సాధన కోసం ఈ నెల 10న నిరసన దీక్ష చేస్తామన్న ప్రొఫెసర్ కోదండరామ్‌.. ఈ నెల 20వ తేదీన ధరణి సమస్యలపై సదస్సు నిర్వహిస్తామన్నారు. కేసీఆర్‌కు రాజకీయ ప్రయోజనాలు తప్పితే ప్రజల బాధలు పట్టడంలేదని ప్రొఫెసర్ కోదండరామ్‌ అన్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: