జనసేనా.. హ..హ.. అదో సినిమా పార్టీ?
నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి అమర్నాథ్.. చంద్రబాబును కలిసిన వారే కలుస్తారు... మోడీని కలిసిన వాళ్లే కలుస్తారు.. ఋషికొండకు చిలకా గోరింకలా వెళ్లారు.. బీచ్ లో నడుస్తూ నడుస్తూ ఆ ప్రేమ పావురాలు ఋషికొండను చూశాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. మోడీ సభ బ్రహ్మాండంగా జరిగిందని.. దేశవ్యాప్తంగా వచ్చే పేరును పక్కదారి పట్టించడం కోసం పవన్, మనోహర్ ఈ రుషికొండ సందర్శన చేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎప్పటికైనా జనసేన పార్టీని బంగాళాఖాతంలో కలిపేసేది నాదెండ్ల మనోహరేనని మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.