జగన్ నిర్ణయంతో.. ఆ కులస్తులు ఫుల్ హ్యాపీస్?
జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో మున్నూరు కాపు కులస్తులు హ్యాపీగా ఫీలవుతున్నారు. సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ను కలిసిన కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి, మున్నూరు కాపు సంఘం ఎటపాక డివిజన్ ప్రెసిడెంట్ ఉమాశంకర్ సీఎంకు ధన్యవాదాలు తెలిపి సన్మానించారు. కాపుల సంక్షేమం,అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని ఆ నేతలు తెలిపారు. విలీన మండలాల్లోని మున్నూరు కాపులకు మేలు చేసేలా సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.