ఇవాళ అకౌంట్లలో డబ్బులు వేయనున్న జగన్?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ ఇవాళ నగదు బదిలీ ద్వారా అకౌంట్లలో డబ్బులు వేయబోతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పెడనలో వైయస్సార్‌ నేతన్న నేస్తం నాలుగో విడత నగదు పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. లబ్ధిదారుల ఖాతాల్లో ఆయన నగదు జమ చేయనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరతారు.

ఉదయం 10.40 గంటలకు సీఎం జగన్  పెడన చేరుకుంటారు. ఉదయం 10.50 గంటలకు పెడన బంటుమిల్లి రోడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. అక్కడ లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. వైయస్సార్‌ నేతన్న నేస్తం నగదు పంపిణీ కార్యక్రమం, గ్రామదర్శిని కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఈ మధ్యాహ్నం 1.30 గంటలకు మళ్లీ సీఎం జగన్.. తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: