ఇవాళ గవర్నర్తో జగన్ భేటీ.. ఎందుకంటే?
మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణే ప్రధాన అంశంగా అయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు ఇటీవల ఏపీలో సీఎం జగన్ కొత్త జిల్లాలు ప్రారంభించారు. 13గా ఉన్న ఏపీ జిల్లాలను ఏకంగా 26కు పెంచారు. ఇది కూడా కీలక నిర్ణయమే.. ఈ జిల్లాల జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా సీఎం జగన్ గవర్నర్తో చర్చించే అవకాశం ఉంది. ఇదీ కాకుండా సీఎం జగన్ నిన్న ప్రధాని మోదీతో.. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్ వంటి మంత్రులతో భేటీ అయ్యారు. ఆ వివరాలను కూడా జగన్ గవర్నర్తో పంచుకునే అవకాశం ఉంది.